సామూహిక సత్యనారాయణ వ్రతాలు మహా అన్నదానం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని ఘనప సముద్రం కట్ట పైన ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కాలం నాటి దక్షిణముఖ ఆంజనేయస్వామి 52వ వార్షికోత్సవం సందర్భంగా 150 హనుమాన్ మాల ధారణ గురువారం ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం పౌర్ణమి పర్వదినం సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని దుగ్యాల అమృత ఆగమ రావు, దుగ్యాల స్వరూప వెంకటనారాయణ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలతో పాటు హనుమాన్ మాల ధారణ భక్తులకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వేద పండితులు ఆలయ అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు