
-బహుజన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా మండల గౌడ సంఘం అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్ మాట్లాడుతూ.
మొగల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్య స్థాపన చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విజయగాథను చరిత్ర మరిచిందని, రాచరికపు వ్యవస్థ నీడలో జమీందారులు, జాకిల్దార్ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడికి దక్కాల్సిన కీర్తి దక్కలేదని, సామాన్యుడు కావడం వల్లే ఆయన ప్రతిభ కాలగర్భంలో కలిసిపోతోందని, ఖిలాషాపూర్ కేంద్రంగా చేసుకొని మొగల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఘనుడు సర్వాయి పాపన్న అని అన్నారు. ఒక సామాన్యుడు ఆధునిక ఆయుధాలను సమకూర్చు. కొని రాజ్యాధినేతలనే ఎదిరించిన ఘనతను, గోల్కొండ కోటపై విజయ బావుటా ఎగురవేసిన కీర్తిని, చరిత్ర పుటల్లో లెక్కించడానికి వారికి చేతులు రాలేవని, పాపన్న ఆనవాళ్లుగా సాక్ష్యంగా నిలిచిన కోటలు బురుజులు, శిథిలమైపోతున్న పట్టించుకునే నాధుడు లేడని అన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండలాధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగుల శ్రీనివాస్ గౌడ్ ,కోశాధికారి మెరుపుల గంగాధర్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగుల సాంబయ్య గౌడ్, సంఘం నాయకులు నల్లగొండ వేణుగోపాల్ గౌడ్ చింతల కోటి శ్రీనివాస్ గౌడ్. నల్లగొండ శ్రీనివాస్ గౌడ్ అనిల్ కుమార్ గౌడ్, మెరుపుల అంజయ్య గౌడ్, జలంధర్ గౌడ్ బత్తిని హరీష్ గౌడ్, బత్తిని కమలాక ర్ గౌడ్, బత్తినిఅనిల్ గౌడ్, గోనెల రాజేశం గౌడ్ , పెరుమాండ్ల నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.