మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి
మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగస్వామ్య ప్రణాళిక పద్ధతిలో ఉపాధి హామీ పనుల ఎంపిక మరియు లేబర్ బడ్జెట్ ఎలా తయారు చేయాలో వారికి అవగాహన కల్పించడం జరిగింది.ఈ సమావేశంలో ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు మాట్లాడుతూ పరకాల మండలంలోని 10 గ్రామపంచాయతీలలో రాబోవు ఆర్థిక సంవత్సరం లో 2 లక్షల 74 వేల 418 పని దినాలు,వాటికి సరిపోవు పనులను గుర్తించాలని మరియు కూలీల ఖర్చుకు గాను 8 కోట్ల 23 లక్షల 20వేల రూపాయలు సామాగ్రి ఖర్చుకు గాను 5 కోట్ల 48 లక్షల 80000 రూపాయలకు గాను లేబర్ బడ్జెట్ అంచనాలు తయారు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.అక్టోబర్ 2 న అన్ని గ్రామాలలో లేబర్ బడ్జెట్ కొరకు ప్లానింగ్ ప్రాసెస్ లో భాగంగా అన్ని గ్రామాలలో గ్రామసభలు ఏర్పాటు చేయాలని మరియు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారము పరకాల మండలంలోని 10 గ్రామపంచాయతీలలో లేబర్ బడ్జెట్లో పనులు ఎంపిక చేసి గ్రామపంచాయతీ తీర్మానాలు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్,ఏపిఓ ఇందిర,టెక్నికల్ అసిస్టెంట్ సుమలత,పంచాయతీ కార్యదర్శులు ల,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.