గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సరైన భద్రత కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు,
గ్రామపంచాయతీలో పని చేసే కార్మికులకు సరియైన భద్రత కల్పించాలని పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఎంపీడీవో కు వినతి పత్రం అందించారు, ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్యాల నరసయ్య, మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెబాట పట్టిన సమయంలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమయంలో గ్రామపంచాయతీ కార్మికుల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వారికి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు, దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అలాగే ఈ గ్రామపంచాయతీ కార్మికులలో చదువుకున్న కార్యదర్శి సహాయకులుగా నియమించాలని, ప్రభుత్వం ఎప్పుడూ చెప్తుంది, వీఆర్ఏలను మళ్లీ తీసుకు వస్తామని కాబట్టి గ్రామపంచాయతీ కార్మికులు ఎవరైనా చదువుకున్న వారిని గుర్తించి వారికి వీఆర్ఏ పోస్టులు ఇవ్వాలని అన్నారు, అలాగే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలుపెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని అన్నారు, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడాలని వారు అన్నారు,ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షులు మామిడి నరేష్,
వాసంకిరణ్ కుమార్,కొమ్ము చరణ్, లక్కీ బాబు , రాములు
మల్యాల లచ్చయ్య,
వజ్రవ్వ ,గంగజల, లక్ష్మి,లచ్చవ్వ పాల్గొన్నారు.