— ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించాలి
• ఎప్పటికప్పుడు ఓపి ఎంఎస్ లో వివరాలు నమోదు చేయాలి
అదనపు కలెక్టర్ నగేష్
నిజాంపేట: నేటి ధాత్రి
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు సమర్ధవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆర్. వెంకటాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఐకెపి కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపిఎంఎస్ లో వివరాలను నమోదు చేయాలని సూచించడం జరిగిందన్నారు. తద్వారా రైతులకు సకాలంలో డబ్బులు అందుతాయని అకాల వర్షాల కారణంగా ధాన్యం తరవకుండా టార్పలిన్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన రైతుల ధాన్యం తేమశాతాన్ని పరిశీలించి తేమశాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత మిల్లులకు తరలించలని సూచించడం జరిగిందన్నారు. నిత్యం అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని పౌరసరఫరాల అధికారులు కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించవలెనని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.