దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మాదిగ కుల బాందవులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల నేటి ధాత్రి
దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు,ధర్మపురి నియోజకవర్గ మాదిగ కుల బాందవుల ఆద్వర్యంలో సోమవారం రోజున ధర్మపురి లోని స్థానిక ఎస్ హెచ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ గారిని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ధర్మపురి నియోజకవర్గ మాదిగ కుల బాందవుల ఆద్వర్యంలో తనకి సన్మానం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని,మా దళిత సోదరులకు తన ప్రాణం పోయే వరకు అన్ని విధాలా అండగా ఉంటానని, ఈ ప్రాంత సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్వయంగా పది నుండి పదిహేను సార్లు కలిసి వారికి వివరించడం జరిగిందని,తను జెడ్పీ చైర్మనగా ఉన్న సమయంలో ప్రతి ఒక్క దళిత సర్పంచ్ లను పిలిపించుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని,15 సంవత్సరాలు తన గెలుపుకు కృషి చేసిన ప్రతి దళిత సోదర సోదీమణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని,ఈ ప్రాంత సమస్యల పరిష్కారం విషయంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని,నియోజక వర్గ దళిత సోదరుల అభ్యున్నతి విషయంలో ఎల్లప్పుడూ అండగా ఉంటామని,దళితుల అభ్యున్నతి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని,తనని ఒక ఎమ్మెల్యే గా బావించవద్దని,ఒక కుటుంబ సభ్యుడిగా భావించాలని,ఎవరికి ఎటువంటి సమస్య ఉన్న తనని నేనుగా కలిసి తమ సమస్యలు చెప్పుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్య నిర్వాహక బాధ్యులు సంఘనబట్ల దినేష్,చిలుముల లక్ష్మణ్,పారపెళ్లి రాజమల్లయ్య,అరికిల్ల సతీష్,దీకొండ మహేందర్, మొకేనాపెల్లి సతీష్,ముల్కల శ్రీనివాస్, ఎదుల్ల అంజన్న,చందోలి శ్రీనివాస్,చెవులమద్ది రమేష్,చెవులమద్ది వినోద్,చిర్ర లక్ష్మణ్,రాయిళ్ల రవికుమార్,బొల్లారపు పోచన్న,చెన్న కుమార స్వామి మరియు పలు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!