మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

*కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలంటూ భరోసా

*రోడ్డు ప్రమాదంలో యువకుడిని కోల్పోవడం చాలా బాధాకరం అంటూ ఆవేదన

వేములవాడ, నేటి దాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రోడ్డు ప్రమాదాల్లో బంగారు భవిష్యత్తు కలిగిన యువకులను కోల్పోవడం చాలా బాధాకరమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీకి చెందిన తేజ అనే యువకుడు ఆదివారం రాత్రి బాలానగర్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆది సోమవారం ఉదయాన్నే మృతుడి ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో యువకుడిని కోల్పోవడం చాలా బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, యూత్ నాయకులు మండలోజు సందీప్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!