‘ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి’

రాజాపూర్/నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో శనివారం రెండో రోజు టోకెన్ సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం ఎదుట పొందుట సమ్మె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్స్ 51 జీవోను సవరించాలని, గ్రామపంచాయతీ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాజపూర్ మండలం అధ్యక్షులు పాశం నరసింహులు ప్రధాన కార్యదర్శి రాములు, మహమ్మద్ షబ్బీర్, మల్లేష్, సాయిలు, నర్సింలు, శ్రీను, నరసమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!