ఎస్పీ టి.శ్రీనివాస రావు.
గద్వాల నేటి దాత్రి
విధి నిర్వహణలో ప్రజలకు అందించిన ఉత్తమ సేవలకు గుర్తుగా..పోలీస్ అధికారులకు రాష్ట్ర స్థాయిలో సేవ పతకాలు రావడం అభినందనీయమని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు మంగళవారం అన్నారు. నూతన సంవత్సరం పురష్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా.. జనవరి 1 వ తేదీన ప్రకటించిన సేవ పతకాలకు జిల్లా నుండి ఎంపిక అయిన హెడ్ కానిస్టేబుల్స్ నారాయణ, రవీందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, పురేందర్, వెంకటస్వామి గౌడ్ లను జిల్లా ఎస్పీ తన ఛాంబర్ లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీస్ శాఖలో ప్రజల మన్ననలు పొందేలా అధికారులు, సిబ్బంది చేసిన సేవలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రజలకు మరింత సేవల అందించేలా కృషి చెయ్యాలని, అలాగే విధి నిర్వహణలో అధికారుల సూచనలు పాటిస్తూ.. ప్రజలకు సేవ చేయడంలో భాద్యతగా తమ వంతు కృషి చేయాలన్నారు.