సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగుతున్న హమాలీల సమ్మె….!
భద్రాచలం నేటి ధాత్రి
జిసిసి హమాలీల ఆరో రోజు సమ్మెను సీఐటీయూ జిల్లా నాయకులు ఎంబీ నర్సారెడ్డి ,కొలగాని రమేష్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల క్రితం సివిల్ సప్లై హమాలీల రేట్ల ఒప్పందం జరిగినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయకపోవడం వలన అని వార్య పరిస్థితిలో హమాలీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా గత ఆరు రోజు ల నుండి సమ్మె నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం హమాలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు రావలసిన వేరియర్సు కొత్త జీవో ప్రకారం వేతనాలను చెల్లించాలని లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిం చారు. ప్రభుత్వాలు మారిన అధికారులు మారిన కార్మికుల కష్టాలు తీరటం లేదన్నారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగరాజు, అజయ్ కుమార్, మురళీకృష్ణ, హమాలి నాయకులు ప్రసాద్ ,శేషు, లోకేష్, ముత్తయ్య ,అనేక మంది కార్మికులు పాల్గొన్నారు