సీఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత..
రామాయంపేట, నేటి ధాత్రి
రామాయంపేట మున్సిపల్ పరిధిలోని 6వ వార్డుకు చెందిన బీర సత్యనారాయణకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి రూ.60,000 విలువైన చెక్కును అందజేశారు. గౌరవనీయులైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ఈ ఆర్థిక సహాయం లభించిందని స్థానిక నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి మాట్లాడుతూ
ప్రభుత్వం అందిస్తున్న సాయం లబ్ధిదారులకు ఉపయుక్తమవుతుందని, అవసరమైన వారు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డేమే యాదగిరి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి వెంకట్. బిర రామచంద్రం. మంగలి సత్యం. దోనేటి గోపాల్. మంగళ్ పవన్. వివేక్ తదితరులు పాల్గొన్నారు.
