బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన గ్రామ మాజీ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామంలో శనివారము బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లీంలు మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు అలయ్ బలయ్ చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలను నిర్వహించారు.
ఈ వేడుకల్లో తుమ్మనపల్లి తాజా మాజీ సర్పంచ్ నవాజ్ రెడ్డి కాంగ్రెస్ ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగ భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతం అన్నారు.