*ఆంజనేయస్వామి దేవాలయంలో మాజీ ఎంపీడీఓ ప్రత్యేక పూజలు*
*పరకాల,నేటిధాత్రి*
హనుమత్ జయంతి సందర్భంగా పరకాల మాజీ ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు కుటుంబ సమేతంగా మండలంలోని మల్లక్కపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.దేవాలయంలో హనుమత్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీడీఓ ప్రత్యేకంగా పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం ఆలయ ఈఓ వెంకటయ్య మరియు ప్రధాన అర్చకులు కాటూరి జగన్నాధ చార్యులు వేదమంత్రాల నడుమ మహదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట సర్పంచ్ దొమ్మటి కవిత మధు,పంచాయతీ కార్యదర్శి సుమలత,కారోబార్ అనందరావు తదితరులు పాల్గొన్నారు.
