ఎంపీ వద్దిరాజుతో కలిసి కేటీఆర్ తో భేటీ అయిన మాజీ మంత్రి సంభాని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.టీ.రామారావుతో భేటీ అయ్యారు.అలాగే,ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఊకే అబ్బయ్య,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎడవల్లి కృష్ణ,పీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్,ఇల్లందు నియోజకవర్గ ప్రముఖులు, మునిసిపల్ మాజీ వైస్ ఛైర్మన్ మడత వెంకట్ గౌడ్,వైరా నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు రామచంద్ర నాయక్ తదితరులు తమ ముఖ్య అనుచరులతో పాటు ఎంపీ రవిచంద్ర నేతృత్వంలో శుక్రవారం మధ్యాహ్నం కేటీఆర్ ను కలిశారు.తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి, బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు సంపూర్ణ మద్దతునివ్వాల్సిందిగా కేటీఆర్ కోరగా,అందుకు వారు సానుకూలంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *