తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ

PRESS RELEASE
22-02-2024

గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారికి..

రాష్ట్రవ్యాప్తంగా సన్‌ఫ్లవర్ పండించిన రైతులు మద్దతు ధర రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సంవత్సరం మద్దతు ధర రూ. 6760 ఉండగా మార్కెట్లో మాత్రం రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకే రైతులు అమ్ముకుంటున్నారు. ప్రతి క్వింటాలుకు దాదాపు రూ. 2 వేలు నష్టపోతున్నారు. గతంలో మా ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో మద్దతు ధరకు రైతుల నుంచి సన్‌ఫ్లవర్ కొని రైతులను ఆదుకోవడం జరిగింది. మీరు వెంటనే అధికారులను ఆదేశించి రాష్ట్రవ్యాప్తంగా సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధరకు సన్‌ఫ్లవర్ కొని రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నాను.

ఇట్లు
తన్నీరు హరీశ్ రావు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *