గోశాలలో గోవులకు ఆహారం.. పంపిణీ.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

ధనుర్మాసం సోమవారం అమావాస్య సందర్భంగా.. పాలమూరు పట్టణం తిరుమలహిల్స్ లోని,
శ్రీ త్రినేత్ర దశ భుజా వీరాంజనేయస్వామి దేవస్థానం నంద గోకులం గోశాలలో గోవులకు బెల్లం, కూరగాయలను స్వచ్ఛంద సేవకుడు డా. నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ పంపిణీ చేశారు. ఈసందర్బంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తాము సంపాదించే సంపాదనలో కొంత దాన ధర్మాలకు ఉపయోగించాలన్నారు. సోమవారం సోమావతి అమావాస్య సందర్బంగా.. ప్రతిఒక్కరికి మంచి జరగాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు అయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ తో పాటు హరినాథ్, రాజు, గోశాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!