మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో ఐదేండ్ల జైలుశిక్ష,
జహీరాబాద్,నేటిధాత్రి:
మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితునికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా స్పెషల్ పోక్సో జడ్జి జయంతి విధించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,ఎస్ఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కథనం ప్రకారం సంగారెడి జిల్లా జహీరాబాద్ మండలం మధులై తండాకు చెందిన రాథోడ్ సంజీవ్ అదే తండాకు చేసిన మైనర్ బాలిక ఇంటివద్ద ఒంటరిగా ఉండగా బాలికపై కన్నేసిన రాథోడ్ సంజీవ్ 2020 జులై 7 న ఇంట్లోకి తీసుకెళ్ళాడు.అరుస్తే చంపుతా అని బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడగా వెంటనే బాలిక అరుపులకు చుట్టుపక్కల వారు వస్తున్నారని గ్రహించి పారిపోయాడు.తల్లిదండ్రుల ఫిర్యాదుతో నాటి ఎస్సై కె.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
నిందితుని శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.ఎస్ ఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం. నేరం సంఖ్య: 51/2020- సెక్షన్ 354,ఎ 448,506,, ఐ పి సీ సెక్షన్ 7 %తీ/ష% బి ఆఫ్ పోక్సో యాక్ట్ 2012, చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్. వివరాలలోనికి వెళ్లితే: చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో హిర్యాధి కూతురు వయస్సు 14 సంవత్సరాలు తేదీ 07.07.2020 నాడు మద్యాహ్నం సమయంలో తమ ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలిక పై, అదే తండ కు చెందినా నిందితుడు రాథోడ్ సంజీవ్ అక్రమంగా బాలిక ఇంటిలోకి పోయి అసభ్యంగా ప్రవర్తించి, ఆమె చేయి పట్టుకుని బలవంతంగా తనతో లైంగిక కోరిక తీర్చమని బలవంత పెట్టగ, మైనర్ బాలిక భయపడి అల్లరి చేయగా నిందితుడు ఆమెను భయపెట్టి ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి పారిపొయినాడు, అట్టి వ్యక్తిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ లో దరఖాస్తు చేయగా అప్పటి యస్.హెచ్.ఒ కె గణేష్ ఎస్. ఐ కేసు నమోదు చేసి, ఇన్వెస్టిగేషన్ అనంతరం న్యాయ స్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేయగా, కేసు పూర్వపరాలను విన్న స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి జయంతి నిందితుడు రాథోడ్ సంజీవ్ కు 5-సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ: 10000/-జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుని వివరాలు: రాథోడ్ సంజీవ్ తండ్రి భీమ్ సింగ్, వయస్సు: 30 సంవత్సరాలు, వృతి: కూలిపని, కులం: ఎస్టీ (లంబాడ), నివాసం మధులై తండా, మండలం జహీరాబాద్ జిల్లా సంగారెడి. నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్ రెడ్డి, ఇన్వెస్టిగేషన్ అధికారికె గణేష్ ఎస్. ఐ, ప్రస్తుత ఎస్. ఐ. రాజేందర్ రెడ్డి, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ కృష్ణ, కోర్ట్ లైజనింగ్ అధికారి హెడ్. కానిస్టేబుల్ శంకర్, కె. సత్యనారాయణ ఎస్ఐఐ. లను ఎస్పీ అభినందించారు.