శ్రీ నాగులమ్మ కు తొలి పూజ “మండే మెలుగుట”

శ్రీ నాగులమ్మకు ఆదివాసీ పూజారుల ప్రత్యేక పూజలు

మంగపేట-నేటిధాత్రి

మంగపేట మండలం వాగొడ్డు గూడెం గ్రామం లో వెలిసిన శ్రీ నాగులమ్మ అమ్మవారికి సుంకు పండగ లో భాగం గా ఆదివాసీ పూజారులు,వడ్డెలు మండే మెలుగుట కార్య క్రమాన్ని ఘనం గా నిర్వహించారు.కార్యక్రమం లో భాగం గా మంగళవారం ఉదయం పాలాయిగూడెం లో ఉన్న గోదావరి నది లో ప్రత్యేక పూజలు చేసిన ఆదివాసి మహిళలు నీళ్ల బిందెలు తో గోదావరి జలాలు తీసుకొచ్చి అమ్మవారికి సంబందించిన అడారాలను ,గంటలను ,మువ్వలను,అకుం కొమ్ములు,గజ్జెలను శుద్ధి చేశారు.అలాగే అమ్మవారికి సంబంధించిన గద్దె లను పుట్ట మట్టితో అలికి పసుపు కుంకుమ లతో అలంకరించారు.అనంతరం ఆలయ ప్రాంగణం లో ఉన్న సమ్మక్క సారక్క ,పగిడిద్దరాజు,ఘడికమారాజు,ఎర్రమ్మ,కంఖ నాగుల గద్దెల వద్ద పూజారులు ,వడ్డెలు డోలు వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాత్రి 3గంటల సమయం లో మండే మెలుగుట కార్యక్రమాన్ని ఆదివాసీ సంప్రదాయ బద్దం గా, నిర్వహించారు.పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామిజీ ఆధ్వర్యం లో నిర్వహించగా,పూజారులు ,వడ్డెలు బాడిశ నాగరమేష్,మడకం లక్ష్మయ్య,సోడి సత్యం ,మూయబోయిన శివ,కుర్సం పుల్లయ్య,ఈసం సమ్మక్క,కోర్స శ్రీకాంత్,చౌలం భవానీ,కట్టం సమ్మక్క,తుర్స చిన్నాబ్బాయి,సోడి శ్రీను,ఇర్ప రామకృష్ణ,కొమరం ధనలక్ష్మి,కొమరం పాపరావు,ఆదివాసీ కుల పెద్దలు కుర్సం విష్ణు మూర్తి,మడకం రాజేశ్వర్ రావు,కోర్స ముసలయ్య,కారం సాంబయ్య,మడకం రమేష్,కుర్సం నరేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!