Sri Datta Hospital First Anniversary Celebration
ఘనంగా.. శ్రీ దత్త ఆసుపత్రి మొదటి వార్షికోత్సవం
బాలానగర్ /నేటి ధాత్రి
బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో ఉన్న శ్రీ దత్త హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహకురాలు.. డాక్టర్ మౌనిక (ఎండి) మాట్లాడుతూ.. ఈనెల ఏడో తేదీ వరకు ఓపి, ల్యాబ్ టెస్టులకు 30 శాతం ఫీజు తగ్గింపు ఉంటుందని అన్నారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తక్కువ ఫీజులతోనే మండలంలోని రోగులకు ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందమోని దత్తాత్రేయ, మాజీ సర్పంచ్ సాటి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుర్వ శ్రీను, డాక్టర్ మారుతి, ప్రసన్నకుమార్, సచిన్, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
