సైమన్ కుటుంబానికి ఆర్థిక సహాయం….

వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఔదార్యం

మంగపేట నేటి ధాత్రి

జిల్లా సరిహద్దు గ్రామం పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామానికి చెందిన చెట్టిపల్లి సైమన్ ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందగా వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మరియు భార్గవ ఆటో మొబైల్ యజమాని నాసిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి వినయ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా రూ ఐదు వేల ఆర్ధిక సహాయం అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు దాత నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని అభినందించారు ఈ కార్యక్రమంలో జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి నాసిరెడ్డి నాగిరెడ్డి మైత్రి గ్రూప్స్ అధినేత మైత్రి వెంకటరెడ్డి మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు పాడి దామోదర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు పాడీ హేమంత్ రెడ్డి చిట్టి మల్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *