చనిపోయిన ఫోటోగ్రాఫర్స్ పిల్లల చదువులకు ఆర్థిక సహాయం
మందమర్రి నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
చనిపోయిన ఫోటోగ్రాఫర్స్. పిల్లలకు. చదువు ఖర్చుల నిమిత్తం
తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం కుటుంబ భరోసా మిగులు నిధుల నుండి ఒక్కొక్కరికి 5000/- రూపాయల చొప్పున మొత్తం
నలుగురి పిల్లల కు 20000/-రూపాయల చెక్ ను
బాధిత కుటుంబాలకు ఈరోజు స్థానిక ఫోటో భవన్లో అందజేయడం జరిగినది
ఈ కార్యక్రమంలో. మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి. ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్. మాజీ ఉపాధ్యక్షులు కామెర గణేష్. కార్యదర్శి. బాణావత్ కృష్ణ. ప్రచార కార్యదర్శి రామస్వామి సురేందర్. తదితరులు పాల్గొన్నారు.