ఉర్దూ జర్నలిస్టులకు ఘన సత్కారం

 

ఉర్దూ జర్నలిస్టుల ఎన్నికల్లో ఐజేయు జయకేతనం.

ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకుందాం: అధ్యక్ష కార్యదర్శులు శ్రీరామ్ రామ్ చందర్, మట్ట దుర్గాప్రసాద్

వరంగల్, నేటిధాత్రి

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అందరు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐక్యతతో పరిష్కరించుకుందామని వరంగల్ జిల్లా ఐజేయు అధ్యక్షులు శ్రీరామ్ రామ్ చందర్, కార్యదర్శి మట్ట దుర్గాప్రసాద్ అన్నారు. ఉర్దూ జర్నలిస్టులకు ఐజెయు ఎప్పుడూ అండగా ఉండి సంఘ బలోపేతానికి సహకరిస్తుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కమిటీలో విజేతలుగా ఐజేయు జర్నలిస్టులు విజయం సాధించడం అభినందనీయమని తెలిపారు. వరంగల్ నగరంలోని ది అర్బన్ స్పైస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎం.డి సాజిధ్, ఉప అధ్యక్షుడు అబ్దుల్ అక్రమ్, కోశాధికారిగా ఎం. డి అమీర్ గెలుపొందారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ఐజేయు అధ్యక్షుడు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోశాధికారులు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఈ అభినందన సభలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు సంగోజు రవి, మిద్దెల రంగనాథ్ యూనియన్ జిల్లా కోశాధికారి వడిచర్ల శ్రీనివాస్, వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు బాలవారి విజయ్ రాజ్ ఐజేయు సభ్యులు చిన్నబాబు, జన్ను శ్యామ్, సిద్ధోజు నితీష్, గంగరాజు కందికొండ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!