మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదిన వేడుకలు.

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 17
తెలంగాణ జాతిపిత, అపర భగీరథుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పిటిసి జోరుక సదయ్య గారు చిట్యాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ గారు పాల్గొన్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …….

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాడని, కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్థిలాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేశ్వర రావు గారు, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నా రెడ్డి గారు, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు మంద సుధాకర్ గారు, పిడిసిల్ల మాజీ సర్పంచ్ నానకంటి ప్రభాకర్ రెడ్డి గారు, గ్రామ అధ్యక్షులు ఎలిటి నరసింహారెడ్డి , గడ్డం రాజు గౌడ్, కత్తి రాజు గౌడ్ ,మాజీ డైరెక్టర్ ముడుపు రవి గారు, నాయకులు చెక్క శ్రీధర్, జనార్ధన్, మంగళంపల్లి శ్రీనివాస్, దేవనూరి కుమార్, రామస్వామి, బొల్లెపల్లి తిరుపతి, మరియు కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!