Soil Testing Awareness for Farmers
మట్టి పరీక్షలపై రైతులకు అవగాహన: ఏడీఏ బిక్షపతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలో మట్టి నమూనాల సేకరణపై బుధవారం రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. జహీరాబాద్ ఏడీఏ బిక్షపతి మాట్లాడుతూ, ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి 10 మట్టి నమూనాలు సేకరించి రైతులకు మట్టి ఆరోగ్య కార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్డుల ద్వారా సమతుల్య ఎరువుల వినియోగం వల్ల ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుందని, భూసారం కాపాడబడుతుందని అధికారులు సూచించారు.
