ఈవీఎంలు వీవీ ప్యాడ్లు మొదటి దిశ పూర్తి

వనపర్తి నెటీదాత్రి:
పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు, వీ వీ ప్యాట్ల మొదటి దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లాలోని 296 పోలింగ్ స్టేషన్లు, 11 ఆగ్జిలరి పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఈవీఎంలు, వీ వీ ప్యాట్ల ను మొదటి దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించి ఎంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మానవ ప్రమేయం లేకుండా పారదర్శకంగా, స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేందుకు కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ చేసి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కంట్రోల్ యూనిట్లు 125 శాతం, బ్యాలెట్ యూనిట్లు 125 శాతం వివిప్యాట్ లు మాత్రం 140 శాతం తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీనిప్రకారం ప్రస్తుతం ఈ.వి.యం గోదాం లో నుండి 383 బ్యాలెట్ యూనిట్లు, 383 కంట్రోల్ యూనిట్లు 429 వివిప్యాట్ లను ఎంచుకొని పార్లమెంట్ ఎన్నికలకు ఎ.ఆర్.ఒ అయిన యం. నగేష్ అదనపు కలెక్టర్ రెవెన్యూ కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
మొదటి ర్యాండమైజేషన్ తర్వాత ఎంచుకున్న ఈవీఎం ల జాబితా రాజకీయ పార్టీలకు అందజేసారు. మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైనట్లు కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ
ఎం నగేష్, సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నుండి కొత్త గొల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!