అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి: ఎంపీ సురేష్ కుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పురపాలక సంఘంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో, స్థానిక ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మరియు గౌరవ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా, జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కమీషనర్ జైత్ రాం, ఎంఆర్ఎ దశరథ్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
