ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాం

మండల ముఖ్య కార్యకర్తల సమావేశం..

సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్..
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని అన్నారు..
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు..
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో అమలు చేసేటటువంటి పథకాలకు అర్హులైన వారు 28 తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు..
అదేవిధంగా మండలంలోని గ్రామపంచాయతీల పరదిలో ఉన్న పలు సమస్యలను గ్రామ కమిటీ వారు ప్రజల ద్వారా సేకరించి అధిష్టానానికి తెలియజేయాలని సూచించారు..
తెలంగాణలో ఈ పది సంవత్సరాల అరాచక పాలనలో ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ప్రతి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు..

ఈ కార్యక్రమంలో
బట్టపల్లి సర్పంచ్, నియోజకవర్గ నాయకులు తొలెం నాగేశ్వరరావు, రేగళ్ల సర్పంచ్ కుంజ వసంతరావు, ఉప సర్పంచ్ బాడిశ లక్ష్మీనారాయణ, చిరుమళ్ళ ఉప సర్పంచ్ కోరం వెంకటేశ్వర్లు, మండల కిసాన్ కాంగ్రెస్ నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల మహిళా అధ్యక్షురాలు చందా వెంకటరత్నమ్మ, కార్యదర్శులు షేక్ రఫీ, చంద నాగేశ్వరరావు, మండల నాయకులు ఎర్ర సురేష్, భూక్య అర్జున్, తోలెం నారాయణ, కోరగట్ల విశ్వనాథం, కార్యకర్తలు, మహిళలు యువకులు, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!