
మల్కాజిగిరి
23 నవంబర్
మల్కాజగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గం నేరెడ్ మేట్ డివిజన్ లోని సరస్వతీ ఫంక్షన్ హాల్ లో బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికి ఎంబీసీ కార్పోరేషన్ ఛైర్మన్ నందికంటి శ్రీధర్,ఇంచార్జీ కల్వకుంట్ల వంశీ శ్రీధర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రతి ఒక ఓటరు ఓటు వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్క ఓటరుని కలసి బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చెయ్యాలని,ప్రతి కార్యకర్త మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో పార్టీలో సముచిత స్థానం గుర్తింపు కల్పిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు.కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, జీకే. శ్రీదేవి, జీవకన్, కరంచంద్, వీరేశం యాదవ్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.