టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్.!

forest forest

టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్ లో వన్య ప్రాణుల కోసం నీటి కుంట ఏర్పాటు

మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్

జైపూర్  నేటి ధాత్రి:

 ఎండలు తీవ్రంగా ఉండడం తో ప్లాంటేషన్ లలో,అటవీ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ పేర్కొన్నారు.జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామ సమీపంలో ఉన్న టీజీ ఎఫ్ డీసీ నీలగిరి ప్లాంటేషన్ లో శుక్రవారం నీటి కుంట తవ్వించారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఈ పనులను శుక్రవారం ఉదయం పరిశీలించారు.ఈ సందర్భంగా ప్లాంటేషన్ మేనేజర్ మాట్లాడుతూ ఎండలు తీవ్రమై నీటి కోసం వన్యప్రాణులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నీటి ఊటలు ఉన్న ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వ ఉండే విధంగా తవ్వించి నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.కాన్కూర్, ముదిగుంట అటవీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ వాచర్ టి.శంకర్,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!