గణపురం ఎంపీడీవో ఎల్ భాస్కర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం కేంద్రంలో శనివారం రోజున ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ఎల్ భాస్కర్ పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం కేటాయించిన 100 రోజుల పనులను ఉపాధి హామీ కూలీలు సద్వినియోగించుకోవాలని సూచించారు పనిచేసిన కూలి డబ్బులు 15 రోజుల క్లియర్ అవుతాయని చెప్పారు ఉపాధి హామీ మస్టర్లను పరిశీలించి హాజరులు తప్పులు లేకుండా రాయాలన్నారు కూలీలు ఎండాకాలం దృష్ట్యా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పని చేయాలన్నారు ఉపాధి కూలీలకు వారు పనిచేసే ప్రదేశం వద్ద టెంటు నీళ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆశ వర్కర్ గాజుల సుమలత అందుబాటులో ఉంచామన్నారు ఒక్కొక్క కూలి నాలుగు మీటర్ల వెడల్పు రెండు మీటర్ల పొడవు ఫీట్ నర లోతు పని చేసినట్లయితే 300 రూపాయల కూలి రావడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పూడిక తీత పనుల ఇన్చార్జి ఏపీఓ రాజు టెక్నికల్ అసిస్టెంట్ శ్రావణ్ ఫీల్డ్ అసిస్టెంట్ దూలం శ్రీదేవి కార్యదర్శి విజేందర్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. కాగా ఉపాధి హామీ కూలీల్లో బీటెక్ డిగ్రీ పీజీలు చేస్తున్నవారు ఉండడంతో వారితో మాట్లాడి వారిని అభినందించారు.