— అప్లై చేసుకున్న అర్హులు
ధ్రువపత్రాల స్వీకారణ
నిజాంపేట:నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారు ఫారం ను అందిఇవ్వాలని ఎంపీడీవో రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలంలో గల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువత నూతన అప్లై చేసుకున్న దరఖాస్తు ఫామ్ తో సహా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువీపత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, జిరాక్స్లు కార్యాలయంలో అందివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ నర్సింలు, బాలయ్య, వినయ్ తదితరులు పాల్గొన్నారు