కల్బేమల్ లో విద్యుత్ ప్రమాదం…

Electrical accident. Electrical accident.

కల్బేమల్ లో విద్యుత్ ప్రమాదం…

• కుటుంబ సభ్యులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

జహీరాబాద్. నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలోని కల్బేమల్ గ్రామంలోని దళిత
వాడలో శనివారం రాత్రి విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులుగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షాలతో.. కాలనీలోని మాజీ ఎంపీటీసీ సభ్యుడు మాణిక్, శిరోమణిలకు చెందిన ఇండ్ల సమీపం వద్ద శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఉన్నట్టుండి విద్యుత్ తీగలు నేల వారాయి. ఇంటి పైకప్పు కు సమీపంలో ఉన్న ఇనుప కడ్డీలకు ఎర్తింగ్ విద్యుత్ తీగ తగలడంతో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. దీంతో మాణిక్ స్వగృహంలో పంటలు ఏర్పడ్డాయి. అట్టి సమయంలో మాణిక్ మినహా కుటుంబ సభ్యులందరూ ప్రార్థనలు చేసేందుకు చర్చికి వెళ్లడంతో కుటుంబ సభ్యులందరికీ తృటిలో ప్రాణాపాయం తప్పింది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాకపాక యంత్రం సకాలంలో రాకపోవడం, అందుబాటులో లేని కారణంగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని బాధితులు మాణిక్, శిరోమణిలు వాపోయారు. ఈ మేరకు బాధితులు స్థానిక హదునూర్ పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!