నర్సంపేట,నేటిధాత్రి :
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సాధారణ ఎన్నికల పరిశీలకుడు షణ్ముఖరాజన్ శనివారం నర్సంపేట ఆర్వో కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నర్సంపేట నియోజకవర్గం ఆర్వో కె కృష్ణవేణి ఎన్నికల పరిశీలకునికి ఈ నెల 30న జరిగే పోలింగ్ నిర్వహణకు తగు ఏర్పాట్లుపై సాధారణ పరిశీలనకు వివరించారు.అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూం ను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తల పైన సంబంధిత రిటర్నింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లపైన సాధారణ ఎన్నికల పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు భద్రత సిబ్బంది పకడ్బందీగా విధులు నిర్వహించాలని వారు అన్నారు.వారి వెంట ఎసిపి తిరుమల్, ఏఆర్వోలు విశ్వ ప్రసాద్,చెన్నారావుపెట ఏఆర్వో ఫణికుమార్,దుగ్గొండి ఏఆర్వో రవి చంద్ర,ఖానాపూర్ ఏఆర్వో కిరణ్,నల్లబెల్లి ఏఆర్వో రాజేష్, నెక్కొండ ఏఆర్వో రాజ్ కుమార్,సిఐ లు కిషన్,రవి కుమార్ , తదితరులు పాల్గొన్నారు.