మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :

గీసుకొండ మండలంలోని కొనాయిమాకుల క్రాస్ వద్ద కాంగ్రెస్ పార్టీ గీసుకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.అనంతరం సుమన్ పై నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒక బిఆర్ఎస్ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసి సర్వసభ్య సమాజం తలదించుకునేలా చెప్పులేపి సవాల్ విసిరిన బాల్క సుమన్ అందుకు ప్రోత్సహించిన నాయకులను నాలుగు కోట్ల మంది తెలంగాణ సమాజం ప్రజలు చెప్పులతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆరోపించారు.మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ నుంచి పారిపోయేదాకా తరిమి కొడతామని అలాగే కేసులు నమోదు చేసి సుమన్ ను చట్టపరంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రుద్ర ప్రసాద్,కాంగ్రెస్ మండల నాయకులు సుభాష్, మర్రి క్రాంతి, మాదాసి రాంబాబు, దౌడు ప్రవీణ్,వజ్ర రాజు,యాకూబ్, భరత్, రవికుమార్, నరసింహ,రమేష్ నాయక్, చెవుల నాయక్ తదితరులు పాల్గొన్నారు.

# గీసుగొండ మండల కేంద్రంలో…..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల
కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి రాస్తారోకో చేశారు. అనంతరం సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు, బీసీ నేత సాయిలి ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై మండిపడ్డాడు.ఈ కార్యక్రమంలో దౌడు ప్రవీణ్, కోట యాకూబ్,కోట చంటి, ఇనుముల అభిలాష్, జీవన్, కర్ణాకర్, జాకీర్, విజయ్,వర్కింగ్ ప్రెసిడెంట్ నాగారపు. స్వామి, గీసుకొండ మండల మహిళ నాయకురాలు కొమ్ము సవిత, గుండ అనసూయ,పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!