మిత్ర ఫౌండేషన్ ద్వారా విద్య భరోసా.
కల్వకుర్తి నేటి ధాత్రి :
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సామాజిక సేవలో ముందుంటున్న మిత్ర ఫౌండేషన్ మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కల్వకుర్తి పట్టణానికి చెందిన అరవింద్ చారి యొక్క ఇద్దరు పిల్లలను శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం లో పదవ తరగతి చదివే వరకు వారి విద్యకు సంబంధించిన అన్ని ఖర్చులను మిత్ర ఫౌండేషన్ భరిస్తుందని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు.విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని మరింత ఉత్తమంగా తీర్చిదిద్దే దిశగా మిత్ర ఫౌండేషన్ విద్యా భరోసా కృషి చేస్తుంది.ఈ కార్యక్రమంలో ఫౌండర్ చంద్రకాంత్ రెడ్డి, అధ్యక్షులు రసూల్ ఖాన్, పాఠశాల యాజమాన్యం, మిత్ర సభ్యులు శ్రీకాంత్ నేత, నరేష్, శ్రీనేష్, కార్తీక్, హలీం ,తరుణ్, మహేష్ ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.