హైదరాబాద్, నేటిధాత్రి
తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక మార్పులు చేసింది. ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారికి కూడా, కుడి చేతి చూపుడు వేలుకు ఇంకు పెడతారు. అలాగే సహాయకుడు అదే బూత్ కు చెందిన ఓటరై ఉండాలి అని, ఒక్కరికీ ఒక్కరూ, ఒక్కసారి మాత్రమే వెళ్ళాలని, ఒకరికి సహాయకంగా వచ్చిన వ్యక్తి వేరొకరికి సహాయంగా వెళ్లకూడదని నిర్ణయించారు. ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారు. ఈసారి ఉదయం 5.30గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రారంభిస్తారు అని,
పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూడా కూర్చోవచ్చు అని నిర్ణయించారు.