బీ ఆర్ ఎస్ పార్టీ మండలం లో ఇంటింటి ప్రచారం

మంగపేట నేటిధాత్రి

మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మంగపేట మండలంలో పలుగ్రామలలో ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని వివరిస్తూ , కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు మాట మార్చారు అని అన్నారు,క్వింటా వడ్లకు 500 బోనస్ ఇస్తానని ఇవ్వలేదని అన్నారు, ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేదని అన్నారు, పెన్షన్లు 4వేలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వడంలేదని అన్నారు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు,కావున ఇప్పుడు, మళ్లీ ఓట్ల కోసం రైతు రుణమాఫీ ఆగస్టు 15 తారీకు చేస్తానని అంటున్నాడు. కావున ప్రజల గమనించాలని ఇప్పుడు జరిగే మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వీరి వెంట మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం, పి ఎ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, జిల్లా నాయకులు, కాకులమర్రి ప్రదీప్ రావు తాటి కృష్ణ, సీనియర్ నాయకులు, ఆళ్ల జనార్దన్, కోరం నర్సింహులు, చిన్నదర్ చక్రధర్, యర్రంకాని మురుషోత్తం, తదితరులు పాలుగోన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!