వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో జిల్లా కేంద్రానికి చెందిన విలేకరులు ప్రింట్ ఎలక్ట్రానిక్ లలో నిజాయితీగా పని చేసే వారిని దుష్ప్రచారం చేయవద్దని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎ మ్ ఏ ఖాదర్ పాషా ఒక ప్రకటనలో కోరారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం లో విలేకరులు గతంలో అవినీతి అక్రమాలను పత్రికల ద్వారా ప్రభుత్వ ని కి ప్రజల కు ఎప్పటికప్పుడు ఎవరి బెదిరింపులకు భయపడకుండా వెలుగులోకి తెచ్చారని ఆయన తెలిపారు కొల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన ఒక విలేఖరి వాట్సప్ మెసేజ్లు పెట్టి వనపర్తి లో నిజాయతీ గా వార్తలు రాసి విలేకరి కి బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు ఆ విలేఖరి గురించి వనపర్తి లో ప్రభుత్వ అధికారులను అన్ని రాజకీయ పార్టీల నాయకులను వివిధ వ్యాపార వర్గాలను ప్రజలను విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తాయని ఆ విలేకరి బెదిరింపులకు తాటాకు చప్పులకు వనపర్తి విలేకరులు భయపడర ని ఆయన తెలిపారు వనపర్తి జిల్లా కేంద్రంలో పనిచేసే విలేకరుల కు తెలంగాణ జన సమితి అండగా ఉంటుందని వారికి ఏ సమస్య వచ్చినా జన సమితి ముందుండి పోరాటం చేస్తుందని అన్నారు గతంలో ప్లాట్ల రాని విలేకరులకు తెలంగాణ జన సమితి అండగా నిలిచిందని ఆయన తెలిపారు ప్రస్తుతం వనపర్తి నియోజకవర్గం లో అక్రిడేషన్ ఉన్న విలేకరులకు లేని విలేకరులకు జిల్లా కలెక్టర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి ఎ అవుట్ తో తో కూడిన ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వం ద్వారా ఇల్లు నిర్మించుకోవా డా నికి 10 లక్షలు ఉచితంగా ఇవ్వాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు విలేకర్లకు ఇళ్ల స్థలాల విషయంలో తెలంగాణ జన సమితి పూర్తి అండగా ఉంటుందని ఖాదర్ తెలిపారు