ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని.

Vice President Vice President

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని.

జహీరాబాద్ నేటి ధాత్రి:

గుజరాత్ లో జరిగిన విమాన ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మొహమ్మద్ ముల్తాని
అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌ పై జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల మాచునూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సంఘటన అత్యంత బాధాకరం,సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరిన ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే కుప్ప‌కూలిపోవ‌డం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని,ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ
వారి కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..ఈ ప్రమాదంలో గాయ‌ప‌డ్డ వారు ఆ భ‌గ‌వంతుడిని దయతో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మనసారా కోరుకుంటున్నానని మరియు చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!