ప్రగతి స్టేడియంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో కొక్కిరాల రఘుపతి రావు జ్ఞాపకార్థంగా ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు యువసేన శ్రీరాంపూర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. యువకులలో క్రీడా స్ఫూర్తినీ పెంచడంకోసం,మానసిక వికాసం కోసం,స్నేహభావాన్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నూకల రమేశ్,ధర్ని మధు 21 వార్డు ఇంచార్జీ
,మాజీ కౌన్సిలర్లు పుదరీ కుమార్,తెనుగు దేవేందర్,మాజి ఎంపీటీసీ ఎల్పుల రవీందర్,చిలుకా మల్లేష్ వార్డు ఇన్చార్జులు అత్కాపూర్ సతీష్,నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు నారిగే నరేష్,అంగిడి ,రాజేష్,ఉప్పల్ రమేష్ మారు మల్లన్న నాగార్జున,ఆర్గనైజర్ భీమిని రాజేష్,కొండే రజినీ కాంత్,గుర్రపు సురేష్,మూట శేఖర్,ప్రదీప్,ప్రశాంత్ తదితర పాల్గోన్నారు