జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రోజున వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో “యోగ మహోత్సవం” ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి వి.బి.నిర్మల గీతాంబ మరియు విశిష్ఠ అతిథిగా హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. కె.పట్టాభి రామారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు శోభా బృందం ఆధ్వర్యంలో వివిధ ఆసనాలు, శ్వాస పద్ధతులు ప్రదర్శించబడ్డాయి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ మాట్లాడుతూ – ‘‘యోగా మన మానసిక, శారీరక మరియు ఆధ్యాత్మిక అంశాలలో సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. యోగా నిత్య ప్రక్రియ వల్ల మనం మన సాధారణ ఆరోగ్యం మరియు శక్తిని మెరుగుపరచుకోవచ్చు అని తెలిపారు.యోగా టీచర్లు శోభ మరియు భాస్కర్ యోగా ప్రాముఖ్యతపై ప్రసంగించి, ఆరోగ్యపూరిత జీవనానికి యోగా అవసరమని స్పష్టం చేశారు.

ఈ యోగా కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే, వరంగల్ హనుమకొండ జిల్లాలో ఇతర న్యాయమూర్తులు వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, జనరల్ సెక్రటరీ డి. రమా కాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హాజరయ్యారు.

అనంతరం యోగా గురువులను న్యాయమూర్తులు మరియు వరంగల్ బార్ అసోసియేషన్ వారు శాలువాలతో సన్మానించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version