మంత్రి హరీష్ రావు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ శశాంక

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు

మరిపెడ నేటి ధాత్రి

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు పర్యటనను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ శశాంక మంగళవారం మరిపెడ లో ని ఏర్పాట్లను పర్యవేక్షించారు,డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడలో ఈనెల 28వ తేదీన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా 35 కోట్లతో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలిసి పనులను పర్యవేక్షించారు, రాష్ట్ర మంత్రి హరీష్ రావు రాకను పురస్కరించుకుని ఏర్పాట్లను ఘనంగా చేపట్టాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు,
కలెక్టర్ వెంట ఎంపీపీ అరుణ రాంబాబు, జడ్పిటిసి శారదా రవీందర్, క్లాస్ వన్ కాంట్రాక్టర్ రామడుగు అచ్యుత్ రావు, గడ్డం వెంకన్న,ఆర్డీవో నరసింహారావు, ఆర్ అండ్ బి అధికారి తానేశ్వర్, టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ అధికారి ఉమా మహేష్, జిల్లా వైద్యశాఖ అధికారి అంబరీష్, ఎంపీడీవో ధన్సింగ్, తాహాసిల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!