Collector Inspects Site for Substation
సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సబ్ స్టేషన్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్థల పరిశీలన చేశారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమీపంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలాలను గురువారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఎన్పీడీసీఎల్ సీఈ అశోక్ తో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, కలెక్టర్ పలు సూచనలు చేశారు.
పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
