రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామమైన గుడ్డెలుగులపల్లిలో వర్క్ సైట్ పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పలకలు, విద్యార్థులకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో సెక్టోరీలు అధికారి అశోక్ రెడ్డి, మండల విద్యాధికారి అంబటి వేణుకుమార్, సిఅర్పి అశోక్ రెడ్డి, వర్క్ సైట్ స్కూల్ ఇంచార్జి మరియు ఇటుక బట్టీల యజమాని చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.