గణపతి ఉత్సవాల సందర్భంగా పెన్నులు,నోట్ బుక్స్ పంపిణీ

నర్సంపేట టౌన్,నేటిధాత్రి :

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో పోచమ్మతల్లి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపంలో స్థానిక కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ చిన్నారి విద్యార్థులకు నొటుబుక్స్ పెన్నులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ సకల విద్యా మెదస్సు కలగడం కోసం గణపతి నవరాత్రుల సందర్భంగా కొలువుదీరిన వినాయకుని విగ్రహం వద్ద సరస్వతి గరక తులసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు విద్యార్థులు, తల్లిదండ్రులతో చేయించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వేదపండితులు శ్రీమాన్ శ్రీ నిశాంత్ శర్మ, పోచమ్మ యూత్ అసోసియేషన్ సభ్యులు,వార్డు కమిటీ సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *