కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

* 22,00,352 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

నేటిధాత్రి, చేవెళ్ల :

 

 

 

 

చేవెళ్ల మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కాలే యాదయ్య కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న పేద కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం పెద్ద ఉపశమనంగా నిలస్తుందన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీపరిధికి చెందిన మొత్తం 22 మంది లబ్ధిదారులకు రూ.22,00,352 లక్షల విలువైన చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఆర్థిక భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా మారుతుందని అన్నారు. పేద కుటుంబాల పెళ్లి అవసరాలకు ప్రభుత్వం సహాయం అందించడం ద్వారా అనేక కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి. కృష్ణయ్య, చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ 15వ వార్డు కౌన్సిలర్ బండారి శైలజా ఆగిరెడ్డి, మాజీ డిసీసీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, చేవెళ్ల, ముడిమ్యాల్ పి. ఏ. సి. ఎస్ చెర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆలంపల్లి వీరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్లు యాదిరెడ్డి, క్రిష్ణ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు, రాంరెడ్డి, శంకర్, ప్రభాకర్, టేకులపల్లి శ్రీనివాస్, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version