ఘనప సముద్రం మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ

పంపిణీ చేసిన మంత్రి సీతక్క

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం
కేంద్రంలో ఘనప సముద్రము లోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్సకారుల అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా చేప పిల్లల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని ఉద్దేశంతో చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్ర్తీ మరియు శిశు సంక్షేమం మంత్రివర్యులు దనసరి సీతక్క అన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన 100% పై రాయితీతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కలిసి లాంచనంగా ప్రారంభించి గణపసముద్రం చెరువులో చేపలను వదిలారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మండల కేంద్రంలోని గణపసముద్రం రిజర్వాయర్లో 14.19 లక్షల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల్లో వెలుగులు నింపడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చేప పిల్లల పంపిణీ తో మత్స్యకార కుటుంబాలు ఆర్థిక సుస్థిరత కలిగించడమే కాదు వారి జీవితాల్లో శిరలు కురిపించాలని ఆశిస్తున్నామని వారు అన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో మత్స్యకార సహకార సంఘాల అన్ని సొసైటీలుకు చెరువులకు కుంటలకు ప్రభుత్వం ద్వారా వచ్చే చేప పిల్లలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఏటా అక్టోబర్ మాసంలో చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందని గతంలో చెరువులలో పంపిణీ చేసిన దానికంటే మిన్నగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పంపిణీ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుందని హైదరాబాదు లాంటి మహానగరంలో ఇప్పటికే అక్రమిత చెరువులు కుంటల పై హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణ జరుగుతుందన్న విషయం గుర్తు చేశారు చెరువులు అనగానే కాకతీయుల నాటి ఆనవాళ్లకు ప్రతీక అని ప్రజలందరూ సహకరిస్తే చెరువులు కుంటలు తిరిగి పునర్ వైభవం వస్తుందని కోరారు చేప పిల్లల పెంపకానికి ఉత్సాహవంతులకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు మచ్చ కార సొసైటీ సభ్యులు కూడా చెరువుల పరిరక్షణలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గణపసముద్రం మత్స్యశాఖ సొసైటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!