20 లక్షల నిధులను మంజూరు….

గుండం శివాలయం కు 20 లక్షల రూ..నిధులను మంజూరు చేసిన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క

కృతజ్ఞతలు తెలిపిన బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి

కొత్తగూడ,నేటిధాత్రి:

ములుగు అసెంబ్లీ, మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండలం లోని గుండం పల్లి లో శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం గుండం జాతర ఈనెల 24 నుండి 30వ తేదీ వరకు జరుగు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా… భక్తులు సేధా తీర్చుట మరియు సౌకర్యాల కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క కి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ విన్నపాన్ని తెలియజేశారు వెంటనే సానుకూలంగా స్పందించి రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క గారు.
10 లక్షల రూ.. గల నూతన రేకుల షెడ్డు నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం మరియు 10 లక్షల రూ.. గల గుండం చెరువుకు స్నాన ఘట్టాలు మెట్లు భక్తుల వసతి కోసం మొత్తం 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క..
ఏజెన్సీ ప్రాంతంలో అటు పాకాల సరస్సు ఇటు గుండం సరస్సు పచ్చని ప్రకృతి నడుమ అందమైన కాకతీయులనాటి క్రీస్తుపూర్వం దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం ప్రతి మహాశివరాత్రి సందర్భంగా.. ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేస్తారు కళ్యాణ ఘట్టంలో భక్తులు చుట్టూ నలుమూలల కొత్తగూడ , పోగుళ్లపల్లి ఓటాయి రాంపూర్ ఎదులపల్లి, వేలుబెల్లి, కోనాపూర్ సాదిరెడ్డిపల్లి ఎంచగూడా, మండలంలోని అన్ని గ్రామాలతో పాటు… నర్సంపేట , ఖానాపూర్, చెన్నారావుపేట, నల్లబెల్లి, మల్లంపల్లి, ములుగు, దుగ్గొండి, వరంగల్, మండలాల నుండి భక్తులు పోటెత్తుతారు స్వామి వారి కళ్యాణ ఘట్టంలో భాగంగా… సంకీర్తనలు భజనలు శివనామ నామంతో ఓం నమశ్శివాయ అంటూ ఆలయం శివనామ స్మరణతో మార్మోగుతుంది భక్తుల సౌకర్యం కోసం ముందుగాk మన మంత్రిగారు 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క కి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు గుండం దేవాలయ కమిటీ సభ్యులు. మంత్రి ఆదేశాల మేరకుపండితులు భాను శాస్త్రి వేద మంత్రోచ్ఛారణ నడుమ వారి దివ్య కరకరములచే భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి,
వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,సుంకరబోయిన మొగిలి కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వీరనేని వెంకటేశ్వరరావు జిల్లా నాయకులు,
భానోత్ విజయ రూప్సింగ్ మాజీ ఎంపీపీ & జిల్లా ప్రధాన కార్యదర్శి,
పులుసం పుష్పలత సరోజన మాజీ జెడ్పిటిసి,
బొల్లు రమేష్ నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్
ఇరుప రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి
గట్టి బాబు మాజీ సర్పంచ్, గట్టి రమేష్, గుల్లపల్లి శ్రీనివాస్, లక్కాకుల రాజు, వద్ది సోమయ్య, బిట్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version