ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో స్థానిక సర్పంచ్ బై రీ వేణి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు చౌటపల్లి రాజేష్ కి.27.000. అలాగే కారంపురి అశోక్ కి24.000. పరికపల్లి పద్మకి 22.500. రూపాయల చెక్కులు అందజేయడం జరిగిందనిమన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆపదలో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉందని అలాగే ఇట్టి చెక్కులు రావడానికి కృషి చేసిన మంత్రి కేటీఆర్ కి మా తరఫున గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలుతెలుపుతూ నామని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కారంపూరి మహేష్ ఉపసర్పంచ్ అల్వాల సాయిరాం వార్డు సభ్యులు ముద్దుల రమేష్ ఎంపీటీసీ సిలివేరి ప్రసూన నరసయ్య ఏఎంసీ డైరెక్టర్ బైరీ రమేష్ మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు సాదుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!