గణేష్ ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు
ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, భూక్య ఉమా,
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రం విలేజ్ ఎన్టీఆర్ నగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, వారి సతీమణి భూక్య ఉమా ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ మండల ఓబీసీ ప్రెసిడెంట్ చిట్ల సంపత్ లావుడియా వెంకన్న అజ్మీర రాజు అజ్మీర దీప్లా మరియు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన టిపిసిసి ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారి వెంకన్న, తరాల వీరేశం, దస్రు నాయక్, కేసముద్రం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్ బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్ మాజీ వార్డ్ మెంబర్ గుండు లక్ష్మీనారాయణ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సుభాష్ రెడ్డి బోళ్ల కటయ్య బొల్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.